Friday, 22 November 2019

హీరోయిన్‌ జాకెట్‌ గొడవ.. పోలీస్‌ స్టేషన్‌ దాకా వెళ్లింది!

బాలీవుడ్‌ హీరోయిన్‌ వాణీ కపూర్‌ సినిమాల విషయం ఎలా ఉన్నా ఎప్పటికప్పుడూ హాట్ హాట్‌ ఫోటో షూట్‌లతో అభిమానులను అలరిస్తుంటుంది. ఇటీవల వార్‌ సినిమాలో అందాలు ఆరబోసిన ఈ భామ ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో హాట్‌ టాపిక్‌గా మారింది. అందాలు కనిపించేలా వాణీ దిగిన ఈ ఫోటో ఇంటర్‌నెట్‌ను షేక్ చేయటమే కాదు ఈ భామను ఇబ్బందుల పాలు చేసింది. ఆమె వేసుకున్న బ్లౌజ్‌ మీద హరే రామ్‌ అన్న పదాలు రాసి ఉండటంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే స్పందించిన వాణీ ఆ ఫోటోను తన సోషల్‌ మీడియా పేజ్‌ నుంచి డిలీట్‌ చేసింది. Also Read: కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాణీ పెట్టిన ఫోటోను డౌన్‌లోడ్‌ చేసిన నెటిజెన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చూసి విపరీతంగా ట్రోల్‌ చేశారు. వివాదాన్ని మరింత పెద్దది చేయటం ఇష్టం లేని వాణీ సైలెంట్‌గా ఉన్న ఆ జాకెట్‌ గొడవ ఇంకా ఆ భామను వెంటాడుతూనే ఉంది. తాజాగా వాణీపై ముంబైకి చెందిన రామ సావంత్‌ అనే వ్యక్తి ఎన్‌ఎమ్‌ జోషీ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశాడు. వాణీ చర్చల కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ ఆయన కేసు నమోదు చేశాడు. పోలీస్‌ స్టేషన్‌ వరకు చేరిన ఈ వివాదం ముందు ముందు వాణీ కపూర్‌కు ఇంకెన్ని కష్టాలు తెచ్చిపెడుతుందో చూడాలి. Also Read: ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల సూపర్‌ హిట్‌ వార్‌లో హృతిక్‌ రోషన్‌తో జోడి కట్టిన ఈ భామ ప్రస్తుతం రణబీర్‌ కపూర్‌కు జోడిగా షంషేర్‌ సినిమాలో నటిస్తోంది. పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో రిలీజ్‌ కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33bUhMf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...