తమిళంలో హీరో ధనుష్, డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్కు మంచి క్రేజ్ ఉంది. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఏ సినిమా ప్రేక్షకులను నిరాశపరచలేదు. ఇటీవల వీరిద్దరి కలయికలో వచ్చిన నాలుగో చిత్రం ‘అసురన్’ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. విడుదలైన మూడు వారాల లోపే ఈ మాస్, యాక్షన్ డ్రామా రూ.100 కోట్లు వసూలు చేసింది. అంతేకాదు.. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇలాంటి గొప్ప సినిమా తెలుగు రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు కొనుగోలు చేశారు. తన సోదరుడు వెంకటేష్ను హీరోగా పెట్టి ఈ సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తమిళంలో ధనుష్ పక్కన మంజు వారియర్ చేసిన పాత్రను తెలుగులో శ్రియ చేయబోతోందని ఇప్పటికే ఊహాగానాలు వచ్చాయి. Also Read: అయితే, దర్శకుడి విషయంలో సురేష్ బాబు తర్జనభర్జన పడుతున్నారని ఇప్పటికే బయటికి వచ్చిన వార్త. చాలా మంది కొత్త దర్శకులను పరిశీలించిన సురేష్ బాబు.. వాళ్లెవరూ ఈ సినిమాకు న్యాయం చేయలేరని డిసైడ్ అయ్యారట. ఆఖరికి తరుణ్ భాస్కర్, ఓంకార్ పేర్లను కూడా ఆయన పరిశీలించారని టాక్. అయితే, తాజాగా బయటికి వచ్చిన సమాచారం ప్రకారం ఫ్యామిలీ సినిమాల డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ‘అసురన్’ తెలుగు రీమేక్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. శ్రీకాంత్ అడ్డాలను ఓకే చేస్తూ సురేష్ బాబు నిర్ణయం తీసేసుకున్నారని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడుతుందని సమాచారం. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఒక మాస్ రివేంజ్ స్టోరీకి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు అనగానే వెంకటేష్ అభిమానుల్లో భయం పట్టుకుంది. Also Read: ఎందుకంటే.. శ్రీకాంత్ డైరెక్ట్ చేసిన ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాలు పక్కా ఫ్యామిలీ డ్రామాలు. దీనికితోడు ఆయన ఆఖరి చిత్రం ‘బ్రహ్మోత్సవం’ పెద్ద డిజాస్టర్. ఈ సినిమా దెబ్బతో మూడేళ్లుగా ఆయన అవకాశాల కోసం తిరుగుతూనే ఉన్నారు. ఇలాంటి దర్శకుడు చేతిలో ‘అసురన్’ లాంటి సినిమాను పెట్టడం ఆశ్చర్యం కలిగించే అంశమే. వాస్తవానికి ఒక ఊర మాస్ సినిమాను వెంకటేష్తో రీమేక్ చేస్తూ సురేష్ బాబు ధైర్యం చేస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమాకు ఒక క్లాస్ డైరెక్టర్ను తీసుకొని మరో ధైర్యం చేస్తున్నారు. కొంపదీసి ఆ మాస్ సినిమాను తెలుగులో క్లాస్ సినిమాగా మార్చేయరు కదా. చూద్దాం ఏం జరుగుతుందో..!!
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XpwcA3
v
No comments:
Post a Comment