గతేడాది అక్టోబర్లో ప్రముఖ బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా చెప్పిన షాకింగ్ విషయాలతో మీటూ ఉద్యమం మొదలైంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ధైర్యంగా చెప్పారు. ఆ తర్వాత ఎందరో నటీమణులు తమను వేధించిన దర్శకులు, నిర్మాతలు, హీరోల పేర్లు బయటపెట్టారు. సినీ పరిశ్రమకు చెందినవార మాత్రమే కాదు క్రికెటర్ల పేర్లు కూడా బయటికి వచ్చాయి. మీటూ గురించి తాజాగా దీపిక పదుకోన్ను స్పందించాల్సిందిగా ఓ ఇంటర్వ్యూలో కోరారు. ఈ విషయం గురించి దీపిక మాట్లాడుతూ వ్యాలిడ్ ప్రశ్న వేశారు. మీటూలో క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు కూడా ఉన్నారు. వారిని ఎందుకు ప్రశ్నించడంలేదని అడిగారు. ‘ఇప్పటివరకు ఈ ప్రశ్నను కేవలం నటీనటులను మాత్రమే అడిగారు. స్పోర్ట్స్ పర్సన్స్ని అడగడం నేను ఇంతవరకు చూడలేదు. కేవలం సినీ ఇండస్ట్రీలో మాత్రమే ఈ లైంగిక వేధింపులు జరగడంలేదు. ప్రపంచంలోని అన్ని వర్క్ ప్లేసెస్లో జరుగుతున్నాయి. అలాంటి ప్రదేశాలన్నీ సురక్షితంగా ఉండాలి’ అన్నారు. దీపిక చెప్పినట్లు పలువురు క్రికెటర్ల పేర్లు కూడా బయటికి వచ్చాయి. శ్రీలంకకు చెందిన ప్రముఖ క్రికెటర్లు లసిత్ మలింగ, అర్జున్ రణతుంగల పేర్లు కూడా బయటికి వచ్చాయి. కానీ వారి గురించి ఇప్పటివరకే ఏ క్రికెటర్ కూడా మాట్లాడలేదు. వారి అభిప్రాయం ప్రకారం మీటూ అంటే ఏంటో కూడా ఇప్పటివరకు చెప్పిన దాఖలాలు లేవు. కేవలం సినీ ఇండస్ట్రీలోనే మీటూ గురించి ప్రశ్నిస్తున్నారు. కానీ దీపిక తన కెరీర్లో మాత్రం ఇలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కోలేదు. ఎందుకంటే ఆమెను బాలీవుడ్కు పరిచయం చేసింది సూపర్ స్టార్ షారుక్ ఖాన్. బాలీవుడ్లో తొలి సినిమాతోనే ఆమె స్టార్ డం దక్కించుకున్నారు. కాబట్టి ఏ హీరోకి, నిర్మాతకి, దర్శకుడికి దీపికతో అసభ్యంగా ప్రవర్తించే ధైర్యం లేదు. అయితే కెరీర్ తొలినాళ్లలో దీపిక ఇతర సమస్యలను ఎదుర్కొ్న్నారు. దీపిక చూడటానికి నల్లగా, సన్నగా ఉన్నారని ఈమెను ఎవరు తీసుకుంటారు హీరోయిన్గా అని చాలా మంది కామెంట్లు చేశారట. కానీ ఇప్పుడు దీపిక బాలీవుడ్లో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్నారు. ఇండియాలోనే ఆమె అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో టాప్ స్థానంలో ఉన్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/311GuXl
v
No comments:
Post a Comment