Monday, 28 October 2019

రామ్‌ గోపాల్ వర్మపై కేసు నమోదు

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మరో వివాదానికి తెర తీశాడు. ఇటీవల కాలంలో రామ్ గోపాల్‌ వర్మ తన సినిమాలతో కన్నా అవి సృష్టిస్తున్న వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు. తాజాగా అలాంటి ఓ వివాదాస్పద చిత్రాన్ని తెర మీదకు తీసుకువస్తున్నాడు రామ్‌ గోపాల్ వర్మ. ఎన్నికలకు ముందు లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పేరుతో ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతిల అనుబంధం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించిన వర్మ, ఇప్పుడు అంటూ మరో వివాదాస్పద చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. గత ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి, తరువాతి పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. Also Read: ఇప్పటికే పోస్టర్లతో తనదైన స్టైల్‌లో వివాదాలు సృష్టించిన వర్మ దీపావళి సందర్భంగా ఆటం బాంబు లాంటి ట్రైలర్‌ను రిలీజ్‌ చేశాడు. ట్రైలర్‌లో జగన్‌, చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌, కేఏ పాల్‌ను పోలిన పాత్రలతో ట్రైలర్‌ను చేశాడు. ఈ ట్రైలర్‌ ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ట్రైలర్‌ కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉందంటూ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా అనంతరపురం కాంగ్రెస్‌ నాయకులు వర్మపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వర్మ తెరకెక్కి్స్తున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా టైటిల్‌ను రద్దు చేయాలంటే అనంతపురం కాంగ్రెస్‌ నేతలు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2qIYoBI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...