ఇటీవల క్యాన్సర్ నుంచి కోలుకుని ముంబయి చేరుకున్నారు బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్. వచ్చీ రాగానే ఆయన తన ట్వీట్తో నెటిజన్లకు కోపం తెప్పించారు. దసరా పండుగ అంటే హిందువులకు ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసిందే. పండుగ రోజున శుభాకాంక్షలు చెప్పకపోయినా ఫర్వాలేదు కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలు చేయకూడదు. కానీ ఇదే పని చేశారు. మహర్నవమి రోజున ఆయుధ పూజలు చేయడం మన హిందువుల సంప్రదాయం. ఆరోజు వాహనాలకు కానీ లేకపోతే ఇంట్లోని ముఖ్యమైన వస్తువులకు కానీ ఆయుధ పూజలు చేస్తుంటారు. అయితే రిషి కపూర్ బాటిల్ ఓపెనర్కు ఆయుధ పూజ చేశారట. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘ఇదే నా ఆయుధ పూజ. దీనిని సరైన సందర్భంలో వాడాలి’ అని పేర్కొంటూ బాటిల్ ఓపెనర్ ఫొటోను పోస్ట్ చేశారు. అయితే ఓ సీనియర్ నటుడు అయివుండి పండుగ రోజున ఇలాంటి మెసేజ్లు చేయడం ఏమీ బాలేదంటూ పలువురు నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ‘ఆయుధానికి పరికరానికి తేడా తెలీదా. మీరు ఓ సీనియర్ నటుడు. ప్రజలకు మంచి విషయాలు చెప్పకపోయినా ఫర్వాలేదు కానీ ఇలాంటి పిచ్చి మెసేజ్లు మాత్రం పెట్టొద్దు’ అని మండిపడ్డారు. అయితే రిషి కపూర్ ఈ కామెంట్స్ను పట్టించుకోలేదు. పెట్టిన ఫొటోను డిలీట్ చేయలేదు. అలా చేసినందుకు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. రిషి ఇలాంటి ట్వీట్లు చేయడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ సమయం సందర్భం లేకుండా పోస్ట్లు పెట్టి నెటిజన్ల చేత తిట్లు తిన్నారు. గతేడాది క్యాన్సర్ బారిన పడిన రిషి కపూర్ చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. దాదాపు 11 నెలల పాటు అక్కడే ఉన్నారు. ఇటీవల చికిత్స పూర్తవడంతో ముంబయి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఏ సినిమాకూ సంతకం చేయలేదు. మొన్నటివరకు వ్యాధితో బాధపడిన రిషి తన భార్యతో కలిసి విహారయాత్ర నిమిత్తం ఇటలీ వెళ్లారు. తిరిగి వచ్చాక ఆయన మళ్లీ సినిమాల్లో నటించే అవకాశం ఉంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Vt21aw
v
No comments:
Post a Comment