Tuesday, 8 October 2019

బాలీవుడ్‌కు నవదీప్.. ఫస్ట్ ఛాన్స్ సన్నీలియోనీతో..!

లక్ అంటే నవదీప్‌దే. ఓ పక్క తెలుగు సినిమాలతో బిజీగా ఉంటూనే మరో పక్క బాలీవుడ్‌లో అడుగుపెట్టేశాడు. తొలి అవకాశంలోనే బాలీవుడ్ హాట్ నటి సన్నీ లియోనీతో కలిసి పనిచేయబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏఎల్‌టీ బాలాజీ హిందీలో ‘రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఇందులో నవదీప్‌, కలిసి పనిచేయబోతున్నారు. ఈ సందర్భంగా సెట్‌లో వీరిద్దరూ కలిసి సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీని సన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘నవదీప్‌తో కలిసి పనిచేయబోతున్నాను. ఇలాంటి మంచి వ్యక్తితో కలిసి పనిచేయబోతున్నందుకు సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు నవదీప్ రిప్లై ఇస్తూ.. ‘మై ప్లెజర్ సన్నీ. యూ ఆర్ సో ఫన్నీ’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ‘రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్’ ఓ ఎరాటిక్ హారర్ సిరీస్. 2014లో ‘రాగిని ఎంఎంఎస్ 2’ టైటిల్‌తో ఓ హారర్ సినిమా విడుదలైంది. ఇందులో సన్నీ లియోనీ ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఇప్పుడు ఇదే టైటిల్‌తో వెబ్ సిరీస్‌ నిర్మించాలని నిర్మాత ఏక్తా కపూర్ భావిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యేలా దక్షిణాది నుంచి నవదీప్‌ను ఎంచుకున్నారు. మరోపక్క నవదీప్.. ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. అల్లు అర్జున్, పూజా హెగ్దే ఇందులో జంటగా నటిస్తున్నారు. తెలుగులోనూ సన్నీ లియోనీ తన అందచందాలను ఆరబోసింది. ‘కరెంటు తీగ’ చిత్రంలో టీచర్ పాత్రలో కుర్రకారు మతిపోగొట్టింది. ఆ తర్వాత ప్రముఖ నటుడు రాజశేఖర్ నటించిన ‘పీఎస్‌ఎల్‌వీ గరుడవేగ’ చిత్రంలో ‘డియో డియో’ అనే స్పెషల్ సాంగ్‌లో సన్నీ ఆడిపాడింది. ఆమె తమిళంలో ‘వీరమహాదేవి’ అనే హిస్టారికల్ సినిమాలోనూ నటిస్తోంది. ఈ సినిమాను ఆపాాలని తమిళనాడుకు చెందిన పలు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ మాత్రమే విడుదలైంది. సన్నీ లియోనీ కానీ వీర మహాదేవి చిత్రవర్గాలు కానీ ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడంలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ntYCvj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...