‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. టీజర్లో చిరంజీవి లుక్, పోరాటాలు చూసిన తరవాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ని వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఆత్రుతగా చూస్తున్నారు. అయితే, అంతకన్నా ముందే ఈనెల 18న ట్రైలర్తో మెగా అభిమానుల ముందుకు రానున్నారు చిరంజీవి. ఈ ట్రైలర్ను ప్రీ రిలీజ్ వేడుకలో విడుదల చేస్తామని ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ వేడుక వాయిదా పడింది. కానీ, ట్రైలర్ మాత్రం షెడ్యూల్ ప్రకారం వస్తోంది. ఈనెల 18న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నట్టు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ప్రకటించింది. పవన్ కళ్యాణ్, రాజమౌళి, వి.వి.వినాయక్ చీఫ్ గెస్టులుగా వస్తున్నారని కూడా వెల్లడించింది. అయితే, ఈ వేడుక వాయిదా పడినట్టు నిన్న వార్తలు వచ్చాయి. ఈనెల 22వ తేదీకి ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకను వాయిదా వేసినట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ రూమర్ను నిజం చేస్తూ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మంగళవారం ట్వీట్ చేసింది. ‘‘సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుకను గొప్పగా నిర్వహించబోతున్నాం. కానీ, వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ వేడుకను సెప్టెంబర్ 22కి వాయిదా వేశాం. అయితే, షెడ్యూల్ ప్రకారం ‘సైరా’ ట్రైలర్ను రేపు విడుదల చేస్తున్నాం’’ అని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్వీట్లో పేర్కొంది. ఈ ప్రీ రిలీజ్ వేడుకను నిర్మాత రామ్ చరణ్ చాలా గ్రాండ్గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రేయాష్ మీడియా ఆధ్వర్యంలో ఈ వేడుక జరుగుతుంది. ఇప్పటికే ఎల్బీ స్టేడియంలో పనులు ప్రారంభమయ్యాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32ES6AW
v
No comments:
Post a Comment