Saturday, 7 September 2019

‘సాహో’ దర్శకుడికి డెంగ్యూ.. అందుకే, వారం రోజులు కనపడలేదా?

గడిచిన నెలరోజులుగా దేశ వ్యాప్తంగా ‘సాహో’ మేనియా నడిచింది. సినిమా విడుదలైన మూడు రోజులు అయితే హంగామా మామూలుగా లేదు. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో హీరో ప్రభాస్‌తో పాటు దర్శకుడు సుజీత్, నిర్మాతల్లో కాస్త భయం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సినిమా చూసిన తరవాత ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉండబోతుందోనని వీరంతా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్ ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయితే, ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. విమర్శకులైతే సినిమా బాలేదని తేల్చేశారు. అయినప్పటికీ కలెక్షన్ల విషయంలో ‘సాహో’ తన స్టామినాను నిరూపించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లనే రాబడుతోంది. Also Read: ఇదిలా ఉంటే, విడుదలకు ముందు కొన్ని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సుజీత్ ఆ తరవాత కనిపించకుండా పోయారు. సినిమా విడుదలైన ఐదు రోజుల వరకు కూడా ఆయన జాడలేదు. దీంతో సుజీత్ గోవా వెళ్లిపోయారంటూ ప్రచారం జరిగింది. కానీ, సుజీత్ కనిపించకపోవడానికి, గోవాకు ఎలాంటి సంబంధలేదని తేలింది. సుజీత్ డెంగ్యూ జ్వరం బారిన పడ్డారని విశ్వసనీయ సమాచారం. విపరీతమైన ఒంటి నొప్పులు, జ్వరం, నీరసంతో బాధపడుతోన్న సుజీత్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారట. అక్కడ ఆయనకు వైద్యపరీక్షలు చేసిన డాక్టర్లు డెంగ్యూ జ్వరం అని తేల్చారట. సుజీత్ రక్తంలో ప్లేట్‌లెట్లు బాగా తగ్గిపోవడంతో ఆయనకు పూర్తిగా విశ్రాంతి అవసరం అని డాక్టర్లు చెప్పినట్లు తెలిసింది. అందుకే ఆయన ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి వద్దే ఉండిపోయారట. మొత్తానికి డెంగ్యూ నుంచి కోలుకున్న సుజీత్ రెండు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చారు. ‘సాహో’ విషయంలో మీడియాపై ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Q3firg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...