‘మన్మథుడు 2’ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై ఊహించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. 17 ఏళ్ల తరువాత ‘మన్మథుడు ’ చిత్రానికి సీక్వెల్గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా నటించింది. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అంటూ నాగ్ కొడుకు నాగచైతన్య సరసన ఆడిపాడిన రకుల్.. ఈ చిత్రంతో నాగార్జునతో రొమాన్స్ చేసింది. అయితే ఈ చిత్రంలో ఆమె కెరియర్లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు కావొస్తున్నా.. స్టార్ హీరోలందరితోనూ జోడీ కట్టినా కేవలం గ్లామర్తోనే లాక్కొచ్చిన రకుల్ నటిగా పూర్తి స్థాయి పెర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది. అయితే ‘మన్మథుడు 2’ చిత్రంలో బెటర్ పెర్ఫామెన్స్ ఇచ్చింది రకుల్. ఇదిలా ఉంటే టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి.. తొలి నుండి రకుల్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆమె బాడీ షేమింగ్స్పై దారుణమైన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి మరోసారి రకుల్ టార్గెట్ చేసింది. ఈ మధ్య నాగార్జునని బాబాయ్ అని పిలుస్తోంది శ్రీరెడ్డి. బాబాయ్ ఎలా అయ్యాడంటే.. దగ్గుబాటి అభిరామ్ (దగ్గుబాటి సురేష్ చిన్న కొడుకు) ఫ్యామిలీతో నాగార్జునకు బంధుత్వం ఉండటంతో ఇలా వరస కలిపేసుకుంది శ్రీరెడ్డి. ఈ వరసల సంగతి పక్కన పెడితే.. అభిరామ్ తనను శారీరకంగా వాడుకుని వదిలించుకున్నాడనే కోపంతో ఆ కుంటుబాన్ని టార్గెట్ చేస్తున్న శ్రీరెడ్డి పనిలో పనిగా ఆ కుటుంబంతో సంబంధం కలుపుకున్న నాగార్జునను సైతం టార్గెట్ చేసింది. చిత్రం ఆగస్టు 10 విడుదల కాగా.. ‘మా బాబాయ్ సినిమా దె**** అంటగా.. అయ్యో అంటూ బూతు పురాణం అందుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ని వదల్లేదు. ‘రకుల్ ప్రీత్ సింగ్ ఐరన్ లెగ్.. పాపం మా బాబాయ్ (నాగార్జున) సినిమాకి హీరోయిన్ అన్నప్పుడే డిసైడ్ అయ్యా. మన్మథుడు 2 డిజాస్టర్ అని. ఆమె కంటే అనసూయ అయితే సూపర్ హిట్ అయ్యేది’ అంటూ రకుల్ గాలి తీసేసింది శ్రీరెడ్డి. ఈ పోస్ట్పై ‘నువ్ చెప్పింది నిజమే అక్కో.. రకుల్ వేస్ట్’ అంటుంటే.. శ్రీరెడ్డి అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది బొమ్మ’ అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MopYhx
v
No comments:
Post a Comment