Friday, 16 August 2019

SIIMA: ‘మహానటి’కి మెగాస్టార్ ఆశీస్సులు.. కీర్తి విధేయతకు ఫ్యాన్స్ ఫిదా

‘మ‌హాన‌టి’ చిత్రంలో సావిత్రిగా అద్భుత న‌ట‌న‌తో మైమ‌రిపించిన కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ న‌టిగా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే కీర్తికి సినీ ప‌రిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంస‌లు వెల్లువెత్తాయి. మెగాస్టార్ సైతం కీర్తి సురేష్‌ను, ‘మహానటి’ చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇప్పుడు నేరుగా కీర్తి సురేష్‌కు తన ఆశీస్సులు అందజేశారు. ఖతార్ రాజధాని దోహాలో జరుగుతోన్న ‘సైమా’ అవార్డుల వేడుకలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ నటి అవార్డుకు నామినేట్ అయిన కీర్తి సురేష్ కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. మహానటి సావిత్రిని తలపించేలా సంప్రదాయ చీరకట్టులో దర్శనమిచ్చిన కీర్తి.. చిరంజీవి వద్దకు వెళ్లి ఆయన ఆశీస్సులు పొందారు. కుర్చీలో కూర్చున్న చిరంజీవి ద్దకు వెళ్లిన కీర్తి.. ఎంతో వినమ్రంగా నవ్వులు చిందిస్తూ మోకాళ్లపై కూర్చొని ముచ్చట్లాడారు. చిరంజీవి కూడా కీర్తి చేయి పట్టుకుని నవ్వుతూ మాట్లాడారు. ఈ ఫొటో మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కీర్తి అభిమానులైతే ఆమె విధేయతకు ఫిదా అయిపోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి అవార్డుల ప్రధానోత్సవం గరువారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి సుమ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అయితే, విజేతలు ఎవరనే విషయాలను సైమా తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడిస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన సమాచారం ఆధారంగా ఉత్తమ తొలి పరిచయ నటి అవార్డును ‘RX 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ అందుకుంది. ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డును ‘RX 100’ దర్శకుడు అజయ్ భూపతికి అందజేశారు. ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును దేవీశ్రీ ప్రసాద్ అందుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yYM0i2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...