‘మహానటి’ మూవీ హీరోయిన్ కీర్తి సురేష్కి అరుదైన గౌరవం దక్కింది. భారతదేశంలో చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలన చిత్ర పురస్కాలను శుక్రవారం నాడు ప్రకటించగా.. ‘మహానటి’ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఎంపికైంది . ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘మహానటి’ ఎంపిక కావడం విశేషం. అందం, అభినయం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చే రూపం నాటికి నేటికి సావిత్రిదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. సిరివెన్నెల అన్నట్టు ఆమె నటనలో ఎవరెస్ట్. అందుకే సావిత్రితో పోలికకైనా చాలా మంది వెనకాడుతుంటారు. అలాంటిది కీర్తి సురేష్ను సావిత్రి పాత్రలో చూపిస్తూ... సావిత్రి వాస్తవ జీవితంలో కీలక ఘట్టాలను తెరకెక్కించే సాహసం చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే సావిత్రిగా కీర్తి సురేష్ నటించింది అనటం కంటే జీవించింది అనటమే కరెక్ట్. సావిత్రి పాత్రకు వందశాతం న్యాయం చేసి శెభాష్ అనిపించుకుంది కీర్తి. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న నటి సావిత్రి. ఆ జీవితం మొత్తం తెరచిన పుస్తకమే. 75 శాతం నటిగానే సాగింది ఆమె జీవితం. ఆ మిగిలిన 25 శాతం జీవిత పరిణామాలపై రకరకాల ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఆసక్తిరేపుతూ మే 9న ప్రేక్షకుల భారీ అంచనాల నడుమ విడుదలైన తొలి తెలుగు బయోపిక్ మూవీ ‘మహానటి’ తిరుగులేని కలెక్షన్లతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. లాంగ్ రన్లో ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో బిగ్గెస్ట్ గ్రాసర్గా సరికొత్త రికార్డులు నమోదు చేసింది . జెమినీ గణేశన్గా దుల్కర్ సల్మాన్.. ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్య.. ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు.. జర్నలిస్ట్ మధురవాణిగా సమంత.. ఫోటోగ్రాఫర్ విజయ్ ఆంటోనీగా విజయ్ దేవకొండ.. ఎస్వీఆర్గా మోహన్ బాబు.. సుశీలగా శాలినీ పాండే.. మాలివికగా అలమేలు... కెవి రెడ్డిగా క్రిష్.. కెవి చౌదరిగా రాజేంద్ర ప్రసాద్.. ఆలూరి చక్రపాణిగా ప్రకాష్ రాజ్ తదితర భారీ తారాగణంతో ప్రేక్షకులు ‘మహానటి’ చిత్రంతో కనులవిందు చేశారు. ఈ హిస్టారికల్ క్లాసికల్ మూవీని వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్న, ప్రియాంక దత్లు నిర్మించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2YBoRkL
v
No comments:
Post a Comment