తొలి చిత్రం ‘ధడక్’తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జాన్వి. ఇప్పుడు ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి ‘గుంజన్ సక్సేనా’. ‘ది కార్గిల్ గర్ల్’ అన్నది క్యాప్షన్. ఐఏఎఫ్ తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవితాధారంగా ఈ సినిమా రాబోతోంది. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్లుక్స్ విడుదలయ్యాయి. పేపర్ ఫ్లైట్ను ఎగరవేస్తున్నట్లుగా లుక్ను డిజైన్ చేశారు. నెటిజన్లను ఈ లుక్ చాలా ఆకట్టుకుంటోంది. కార్గిల్ యుద్ధం సమయంలో గాయపడిన వారిని గుంజన్ తన విమానంలో తరలించి వారి ప్రాణాలను కాపాాడారు. ఈ కథ ఆధారంగా శరణ్ శర్మ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు పంకజ్ కపూర్.. జాన్వి తండ్రి పాత్రలో నటిస్తున్నారు. జాన్వితో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చిందని, తనను ఎంతో గౌరవంగా చూసుకుంటుందని పంకజ్ కపూర్ తెలిపారు. వచ్చే ఏడాది మార్చ్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు జాన్వి ‘రూహీ అఫ్జా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమె రాజ్కుమార్ రావుకు జోడీగా నటిస్తున్నారు. మరోపక్క జాన్వి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న ఫైటర్ సినిమాలో ఆమె కథానాయికగా నటించనున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2PlXtDn
v
No comments:
Post a Comment