Sunday, 11 August 2019

ఖాన్స్ మనందరికీ స్ఫూర్తి.. వాళ్లని అనడం తప్పు: ప్రభాస్

ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘సాహో’ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను హైదరాబాద్ నుంచి ఆదివారం ప్రారంభించింది. ఈ మేరకు ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ మీడియా సమావేశంలో హీరోహీరోయిన్లు ప్రభాస్, శ్రద్ధా కపూర్, నిర్మాతలు వంశీ-ప్రమోద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ప్రభాస్, శ్రద్ధా సమాధానాలిచ్చారు. ఇండియన్ సినిమా అనగానే మనకు ముందుకుగా గుర్తొచ్చేది ఖాన్‌లు, కపూర్‌‌లు. వీళ్లే బాలీవుడ్‌ను ఏలుతున్నారని చాలా మంది ఫీలింగ్. సాధారణ ప్రేక్షకులే కాదు.. సినిమా జర్నలిస్టులదీ ఇదే మాట. ఇలా భావించిన ఒక జర్నలిస్టు ప్రభాస్‌ను ఖాన్‌లను ఉద్దేశించి ఒక ప్రశ్న అడిగారు. ‘‘బాలీవుడ్‌లో ఖాన్‌ల డామినేషన్‌ను అధిగమించేలా ఈ సినిమా రాబోతోంది కదా..! ఆ డామినేషన్‌ను ఎలా తట్టుకుంటున్నారు? ఈ సినిమాతో అవన్నీ పోతాయా?’’ అని ఒక గొప్ప ప్రశ్నను సంధించారు. ఈ ప్రశ్న వినగానే ప్రభాస్‌కు చిర్రెత్తుకొచ్చినా.. ఆ కోపాన్ని ముఖంలో చూపించకుండా చాలా సున్నితంగా, చెంపచెల్లుమనిపించేలా సమాధానం ఇచ్చారు. ‘‘ఖాన్స్ దేశ వ్యాప్తంగా మనందరినీ ఇన్‌స్పైర్ చేశారు. చాలా సినిమాలకు వాళ్లే స్ఫూర్తి. వాళ్లను మనమే కాదు ఎవరూ ఏమీ అనకూడదు. తప్పది. బాలీవుడ్‌లో నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ‘బాహుబలి 1’ తరవాత చాలా పెద్ద స్టార్స్ నాకు మెసేజ్‌లు చేశారు. రణ్‌బీర్ లాంటి బిగ్ స్టార్ చాలా మంది నన్ను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. అక్కడ ప్రెస్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంది. అంత బాగా నన్ను రిసీవ్ చేసుకున్న వారందరికీ నేను నిజానికి కృతజ్ఞతలు తెలపాలి’’ అని ప్రభాస్ వెల్లడించారు. శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ గడిచిన రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ తనకు రెండో ఇల్లుగా మారిందని చెప్పారు. ముంబై నుంచి ఇక్కడికి వచ్చిన తనకు ఈ రెండేళ్లలో ఏన్నో మధుర జ్ఞాపకాలు మిగిలాయన్నారు. యూవీ క్రియేషన్స్, ‘సాహో’ యూనిట్ తనను ఎంతో బాగా చూసుకున్నారని చెప్పారు. తాను తెలుగులో పరిచయం కావడానికి ‘సాహో’ కన్నా గొప్ప చిత్రం తనకు దొరకదని అన్నారు. ‘‘ట్రైలర్‌లో చూపించినట్టు ప్రభాస్‌తో రొమాన్స్, యాక్షన్ ఈ రెండింటిలో దేనిని మీరు బాగా ఎంజాయ్ చేశారు’’ అని యాంకర్ మంజూష శ్రద్ధా కపూర్‌ను అడిగారు. దీనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక రెండూ ఇష్టమే అని శ్రద్ధా నవ్వుతూ వెల్లడించారు. సెట్‌లో ప్రతి క్షణాన్ని ఎంతో ఎంజాయ్ చేశానని, కాబట్టి ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంపిక చేయడం చాలా కష్టమని చెప్పారు. ఇక సినిమా గురించి ప్రభాస్ మాట్లాడుతూ ‘సాహో’లో మంచి లవ్‌స్టోరీ ఉందని అన్నారు. దీన్ని యాక్షన్ లవ్ ‌స్టోరీ అని కూడా చెప్పొచ్చన్నారు. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ పాత్ర చాలా ముఖ్యమైనది చెప్పారు. ఇప్పటి వరకు హిందీలో లవ్ స్టోరీల్లో మాత్రమే చేసిన శ్రద్ధా.. తొలిసారి యాక్షన్ సన్నివేశాల్లో నటించిందని, అద్భుతంగా చేసిందని కొనియాడారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZULAow
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...