హీరోగా వస్తోన్న యాక్షన్ డ్రామా ‘రణరంగం’ సెన్సార్ పూర్తిచేసుకుంది. బుధవారం ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు ‘యు/ఎ’ సర్టిఫికెట్ జారీ చేశారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చారు. ‘రణరంగం’ సెన్సార్ పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ‘యు/ఎ’ సర్టిఫికెట్ లభించింది. ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్లో విడుదల చేస్తున్నాం. ఇటీవల కాకినాడలో ప్రేక్షకాభిమానుల సమక్షంలో విడుదలైన చిత్రం థియేట్రికల్ ట్రైలర్కు అద్భుతమైన స్పందన లభించింది. దర్శకుడు సుధీర్ వర్మ ‘రణరంగం’ను తెరకెక్కించిన తీరు ఎంతో ప్రశంసనీయం. అన్ని వర్గాలవారిని ఈచిత్రం అలరిస్తుంది అనే నమ్మకముంది’’ అని అన్నారు. గ్యాంగ్స్టర్గా ఈ చిత్రంలో శర్వానంద్ పోషించిన పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉండటమే కాకుండా ఎంతో వైవిధ్యంగానూ, ఎమోషన్స్ కూడి ఉంటుందని నాగవంశీ వెల్లడించారు. ‘గ్యాంగ్స్టర్’ అయిన వ్యక్తి జీవితంలో 1990, ప్రస్తుత కాలంలోని సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’ అని చెప్పారు. భిన్నమైన భావోద్వేగాలు, కథ, కథనాలు ఈ చిత్రానికి ప్రధాన బలాలన్నారు. ‘గ్యాంగ్ స్టర్’ పాత్రలో శర్వానంద్ నటన అద్భుతంగా ఉంటుందన్నారు. కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ పాత్రలు కథానుగుణంగా సాగుతూ ఆకట్టుకుంటాయని చెప్పారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZH9t30
v
No comments:
Post a Comment