Friday, 9 August 2019

చెప్పిన‌ట్లే జ‌రిగింది.. జాతీయ అవార్డు విజేత‌ల‌కు మెగాస్టార్ అభినందనలు

జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఈసారి తెలుగు సినిమాలకు పంట పండింది. మొత్తం ఏడు అవార్డులు తెలుగు సినిమాలకు దక్కాయి. తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు దక్కడం పట్ల మెగాస్టార్ ఆనందం వ్యక్తం చేశారు. అవార్డులు పొందిన వారందరికీ అభినందనలు తెలిపారు. ‘మ‌హాన‌టి’, ‘రంగ‌స్థలం’ చిత్రాల‌కు జాతీయ అవార్డులు వ‌స్తాయ‌ని చిరంజీవి ఆ సినిమాల విడుదలకు ముందే చెప్పిన సంగతి తెలిసిందే. ‘మ‌హాన‌టి’ రిలీజ్ అనంత‌రం యూనిట్ స‌భ్యుల‌ను ఇంటికి పిలిపించి చిరంజీవి ఘ‌నంగా స‌న్మానించారు. నాడు ఆయన చెప్పిన మాటలు నేడు ఫ‌లించ‌డంతో చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేసారు. త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ‘రంగ‌స్థలం’కు జాతీయ అవార్డు రావ‌డం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఇత‌ర భాష‌ల నుంచి అవార్డల‌కు ఎంపికైన వారంద‌రికీ మెగాస్టార్ అభినంద‌న‌లు తెలిపారు. కాగా, ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. కాగా, ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చి.ల.సౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘మ‌హాన‌టి’ ఎంపికైంది. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించిన కీర్తి సురేష్‌కు ఉత్తమ న‌టి అవార్డును గెలుచుకున్నారు. ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్ విభాగంలోనూ ‘మ‌హాన‌టి’ అవార్డు సొంతం చేసుకుంది. ఇక నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను తిర‌గ‌రాసిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయకుడిగా సుకుమార్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన ‘రంగ‌స్థలం’ బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో అవార్డు గెలుచుకుంది. బెస్ట్ ఒరిజిన‌ల్ స్ర్కీన్‌ప్లే విభాగంలో ‘చి.ల‌.సౌ’కు.. మేకప్, స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో ‘అ!’ చిత్రానికి అవార్డులు దక్కాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33ohSue
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...