Monday, 12 August 2019

జెనీలియా ఉదారం.. వరద బాధితుల కోసం భారీ విరాళం

తెలుగు ప్రేక్షకుల ‘హాసిని’గా చెరిగిపోని ముద్రవేసిన నటి మరాఠా నటుడు, మహారాష్ట్ర మాజీ సీఎం విలాష్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. రితేష్‌తో వివాహం జరిగిన తరవాత జెనీలియా సినిమాలకు దూరమైపోయారు. పెద్ద కుటుంబానికి కోడలిగా వెళ్లిన జెనీలియా అత్తింటి గౌరవం కాపాడేలా చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. భర్త రితేష్, కొడుకులు రియాన్‌, రాహిల్‌‌లతో కలిసి జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటున్నారు. ఇటీవల మహారాష్ట్రను భారీ వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకునే ఉన్నాయి. అయితే.. జెనీలియా, ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్ కలిసి మహారాష్ట్ర వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని అందించారు. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు దానం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను స్వయంగా కలిసిన ఈ దేశ్‌ముఖ్ జంట చెక్‌ను ఆయనకు అందజేశారు. ఈ విషయాన్ని ఫడ్నవీస్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఫొటో కూడా షేర్ చేశారు. ‘‘మహారాష్ట్ర వరద బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చిన రితేష్, జెనీలియా దేశ్‌ముఖ్‌లకు కృతజ్ఞతలు’’ అని ఫడ్నవీస్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, వదర బీభత్సానికి మహారాష్ట్రలోని సంగ్లి, కొల్హాపూర్, సతార జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరద బాధితుల సహాయార్థం 432 తాత్కాలిక పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. మొత్తం 3.78 లక్షల మంది ప్రజలను ఈ పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ప్రవాహానికి రాష్ట్రంలోని అతిపెద్ద జలాశయాల్లో ఒకటైన కోయ్నా డ్యామ్ నిండుకుండలా మారింది. 100 టీఎంసీల సామర్థ్యంతో 890 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న ఈ జలాశయంలో కేవలం 9 రోజుల్లో 50 టీఎంసీలకు పైగా వరదనీరు వచ్చి చేరింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TqiFX2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...