సుష్మా స్వరాజ్ ఇకలేరనే వార్త విని యావత్తు భారతదేశం దిగ్భ్రాంతిలో ఉన్న సమయంలో బాలీవుడ్ ఈరోజు ఉదయం మరో విషాద వార్త వినాల్సి వచ్చింది. బాలీవుడ్ ఫిల్మ్మేకర్, ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ తాతయ్య జె. ఓం ప్రకాష్ కన్నుమూశారు. బుధవారం ఉదయం ముంబైలో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 93 ఏళ్లు. ఓం ప్రకాష్ మృతిని ఖరారు చేస్తూ నటుడు దీపక్ పరాషర్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ‘‘నా డియరెస్ట్ అంకుల్ మిస్టర్ జె ఓమ్ ప్రకాష్ ఒక గంట క్రితం కన్నుమూశారు. స్వర్గంలో ఉన్న ఆయన మిత్రుడు, మా మామయ్య మిస్టర్ మోహన్ కుమార్ వద్దకు వెళ్లిపోయారు. చాలా బాధగా ఉంది. భారతీయ సినిమాకు వీరి సేవ ఒక బహుమానం. ఇప్పుడు వాళ్లు మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆయనతో కొన్ని నెలల కిత్రం నేను తీసుకున్న ఫొటో ఇది. ఓం శాంతి’’ అని దీపక్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఓం ప్రకాష్ కన్నుమూశారనే వార్త తెలుసుకుని అమితాబ్ బచ్చన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ట్విట్టర్ ద్వారా ఓం ప్రకాష్ మృతికి నివాళి అర్పించారు. ‘‘ప్రముఖ నిర్మాత, దర్శకుడు జె ఓం ప్రకాష్ గారు ఈ ఉదయం కన్నుమూశారు. సున్నిత మనస్కులు, మృదు స్వభావి. నా పొరుగునే ఉంటారు. హృతిక్ రోషన్ తాతయ్య. చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ అని అమితాబ్ ట్వీట్లో పేర్కొన్నారు. హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ తండ్రే ఈ ఓం ప్రకాష్. 1927 జనవరి 24న అప్పటి బ్రిటిష్ ఇండియాలోని సెయిల్కోట్ (పంజాబ్)లో ఓం ప్రకాష్ జన్మించారు. రాజేష్ కన్నా హీరోగా నటించిన ఆపి కి కసమ్ (1974), ఆఖిర్ క్యూ? (1985) వంటి హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలాగే జీతేంద్రతో అప్నా బానా లో (1982), అప్నాపాన్ (1977), ఆశ (1980), అర్పాన్ (1983), ఆద్మి ఖిలోనా హై (1993) వంటి చిత్రాలు తెరకెక్కించారు. సుమారు 15 సినిమాను నిర్మించిన ఓం ప్రకాష్.. 20కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన స్వీయదర్శకత్వంలోనే ఎక్కువ సినిమాలు వచ్చాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2OIJ2su
v
No comments:
Post a Comment