Monday, 22 July 2019

‘డిస్కోరాజా’ దూకుడు.. సెట్ కోసం రూ. కోటి ఖర్చు!

మాస్ మహారాజా హీరోగా వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఏడెక‌రాల స్థలంలో ఒక కోటి 20 ల‌క్షల రూపాయిల ఖర్చుతో నిర్మించిన సెట్‌లో షూటింగ్ జ‌రుపుతున్నారు. ఈ సినిమాకి ఈ సెట్ చాలా కీల‌క‌ం కానుంది. ఈ షెడ్యూల్‌లో ర‌వితేజ‌, వెన్నెల కిషోర్‌, శశిర్ ష‌ర‌మ్‌, టోనీ హోప్‌లపై సినిమాలో అతి కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈ సెట్‌ను థియేటర్‌లో తెరపై చూస్తే ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ కలుగుతుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ‘RX 100’ ఫేమ్ పాయల్ రాజ్ పుత్, ‘నన్ను దోచుకుందువటే’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నభా నటేష్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘నేల టిక్కెట్’ తర్వాత ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్ళూరి.. రవితేజతో నిర్మిస్తున్న రెండో చిత్రమిది. కాగా, తదుపరి షెడ్యూల్ కోసం త్వర‌లో చిత్ర యూనిట్ ఢిల్లీ వెల్లనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోన్న షెడ్యూల్ ఈనెల 26తో పూర్తవుతుందని నిర్మాత రామ్ తాళ్ళూరి చెప్పారు. ఆగస్టు మొదటివారం నుంచి ఢిల్లీలో షూటింగ్ జరుపుతామన్నారు. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్ నభా నటేష్ జాయిన్ అవుతారని చెప్పారు. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులన్ని ఆకట్టుకుంటుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో తమిళ నటుడు బాబీ సింహా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30MCoTd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...