నందమూరి బాలకృష్ణ, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ ఇద్దరూ ఇండస్ట్రీలో చాలా అగ్రిసివ్ అనే టాక్ ఉంది. మంచి వాళ్లకు మంచి వాళ్లు తేడాలు వస్తే తాట తీయడానికి కూడా రెడీ అవుతుంటారు ఈ ఇద్దరు సీరియర్ హీరోలు. ఇక బాలకృష్ణ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఆయనకు కోపం వస్తే ఫ్యాన్స్ని కూడా పబ్లిక్గా దబిడిదిబిడి వాయించేస్తుంటారు. అయితే ఈ ఇద్దరితో కలిసి పనిచేసిన సీనియర్ నటి వాళ్లు ఎందుకు అలా ప్రవర్తిస్తారో చెప్పుకొచ్చారు. Read Also: ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘ఎవరికైతే మీద కమాండ్ ఉంటుందో.. మనం చేస్తున్నది వృత్తి ధర్మం అని అనుకుంటారో వాళ్లకు ఆ కోపం ఉంటుంది. నాకూ కోపం ఉంటుంది. ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే రియాక్ట్ అవుతాం. వాళ్లు అదే చేస్తున్నారు. ఎవరైనా వచ్చి ఓ పది సెల్ఫీలు అడిగితే ఇవ్వగలం. వంద మంది వచ్చి మీద పడిపోతే ఆగండి అని ఎవరైనా చిరాకు పడతారు. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు అక్కడ అంతకు ముందు ఏం జరిగిందన్న దాన్ని ఎవరూ చూపించరు.. తరువాత జరిగిన దాన్నే హైలైట్ చేస్తారు. నిజం వేరుగా ఉంటుంది. అబద్ధమే తొందరగా చేరుతుంది. బాలకృష్ణ, మోహన్ బాబు చాలా మంచి వ్యక్తులు’ అంటూ చెప్పుకొచ్చింది కరాటే కళ్యాణి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2xaAgIq
v
No comments:
Post a Comment